Live

    తెలంగాణ-> కరీంనగర్

కరీంనగర్
గోతులు తవ్వి పైకొచ్చిన చరిత్ర నీది.. : మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్
కరీంనగర్: చరిత్ర గురించి నీతులు చెప్పే సునీల్ రావు కాంగ్రెస్ లో గోతులు తవ్వి పైకి వచ్చారని.. తన గత చరిత్రను తవ్వితీస్తే కరీంనగర్ లో తిరగలేవని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్ హెచ్చరించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుగ్గిళ్ళపు రమేష్ మాట్లాడుతూ యాదగిరి సునీల్ రావు సెలెక్టెడ్ అజ్ఞాని అని .. ఎలెక్టెడ్ మేయర్ మాదిరిగా మాట్లాడడం లేదని, నామిని ఎవరో, బినామీ ఎవరో కరీంనగర్ నగర ప్రజలకు బాగా తెలుసని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని, నోటికొచ్చినట్లు మాట్లాడితే తిరిగి అదే స్థాయిలో ప్రతిఘటనలు తప్పవని ఆయన హెచ్చరించారు. సునీల్ రావు ప్యారాచూట్ లీడర్ కాకుంటే తెలంగాణ ఉద్యమంలో అతడి పాత్ర ఏ మేరకు ఉందో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ను తెగ పొగుడుతున్న సునీల్ రావు తిరిగి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ లో చేరుతారా ఆశ్చర్యం కలుగుతుందన్నారు.
రాజకీయ అవగాహన రాహిత్యంతో పసలేని ఆరోపణలు చేసి చరిత్రలో సునీల్ రావు స్క్రాప్ గా రుజువయ్యాడని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ పై పర్సనల్గా విమర్శలు చేసి నవ్వుల పాలయ్యాడని దుయ్యబట్టారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం సుమారు 8వేల కోట్ల అభివృద్ధి పనులను తీసుకొచ్చిన ఘనత ఎంపీ బండి సంజయ్ కుమార్ కే దక్కుతుందన్నారు. సునీల్ రావు వినోద్ కుమార్ కు బినామీ కాకుంటే ఎందుకు అంత ఉలికి పాటుతో ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి పస లేని విమర్శలు చేశారని అన్నారు. సునీల్ రావు కేరాఫ్ కాంగ్రెస్ అని ఎప్పటికీ బిఆర్ఎస్ కాలేడని విమర్శించారు. అందుకే అదే స్థాయిలో కాంగ్రెస్ లో ఎంతో కష్టపడ్డానని చెప్పడం తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తున్నాడని సంకేతాలు ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రెస్ మీట్ లో ఆనంద్, ప్రవీణ్, లోకేశ్ పాల్గొన్నారు.

Last Updated:2024-01-10

కరీంనగర్
ఇక అది జువ్వాడి చొక్కారావు ట్రాఫిక్ పార్కు
కరీంనగర్: వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏమిటీ అన్నట్లుగా .. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో చెలరేగి పోయిన అధికారి.. రవాణా శాఖ అదనపు కమీషనర్ , కేసీఆర్‌ బంధువు పాపారావు. ఈయనకు అర్హతలు లేకున్నా అడ్డదారిలో ఉద్యోగం సంపాదించాడు. కేసీఆర్ తమకు దగ్గరి బంధువు అంటూ రవాణా శాఖలో మకుటంలేని మహారాజులాగా వ్యవహారించాడు. ఈయన మాటే శాసనం.. ఈ చూపే చట్టంలా పదేండ్లు రాజ్యం ఏలాడు.
అధికారం ఉంది కదా అని.. కరీంనగర్ లో ప్రభుత్వ నిధులతో నిర్మించిన పిల్లలకు ట్రాఫిక్ మీద అవగాహన కోసం పార్కు నిర్మించారు. కానీ నిబంధనలకు విరుద్దంగా పాపారావు తన తండ్రి కృష్ణమనేని వెంకట రామరావు పేరు పెట్టాడు. పార్కులో తండ్రి విగ్రహం కూడా పెట్టాడు. మూడేండ్ల కిందట అప్పటి కరీంనగర్ డీటీసీ పుప్పలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పార్కు ఓపెనింగ్ చేపట్టారు. కేవలం అధికారం ఉందనే కారణంతోనే ఆ టైమ్ లో ఎవరూ మాట్లాడకుండా అందరి నోర్లు మూయించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరవాత నెమ్మదిగా బీఆర్ఎస్ టైమ్ లో చేసిన అక్రమాలు.. అధికార బలంతో చేసిన పనులపై నజర్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే చిల్ట్రన్స్ పార్కు పేరు కృష్ణమనేని వెంకట రామరావు నుంచి స్థానిక నాయకుడు జువ్వాడి చోక్కారావు గా పేరు మారుస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మారిన పేరు వెంటనే అమల్లోకి వస్తుందని అందులో పేర్కొనడం విశేషం. పార్కు పేరు మార్చడం పట్ల కరీంనగర్ నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. సదరు అధికారులు మాత్రం ఖంగుతినాల్సి వచ్చింది.

Last Updated:2024-01-09

కరీంనగర్
ఎస్ ఎస్ ఏ ఉద్యోగులకు రెండు నెలల నుంచి జీతాల్లేవ్ : ఎడ్ల రమేశ్
కరీంనగర్: ఎన్నికల నేపథ్యంలో ఒక నెల .. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది.. మొత్తంగా రెండు నెలల నుంచి జీతాల్లేక సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలకు కనిపించడం లేదా అంటూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో సమగ్ర శిక్షా ఉద్యోగులు 555 మంది విధులు నిర్వహిస్తున్నారని.. ఇందులో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ 80 మంది, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు10, కంప్యూటర్ ఆపరేటర్లు 10, పార్ట్ టైం ఇన్స్పెక్టర్లు 80,ఐఇఆర్పిలు 28, మెసెంజర్లు12,డీపీవో స్టాఫ్ 9 మంది, కేజీబీవీ టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగులు 317, బిఆర్ఎస్ లో టీచింగ్ నాన్ టీచింగ్ 9 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలన్నారు. రెండు నెలల నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలను త్వరగా చెల్లించి, ఆర్థిక ఇబ్బందులను దూరం చేయాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తమ వాటాను జమ చేసిందని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు జమ చేయకపోవడం వల్లనే రెండు నెలలుగా వేతనాలు ఆగిపోయాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేయించుకుంటున్నప్పటికీ వేతనాలు ఇవ్వడంతో తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు. జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారి.. ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోని ఒరిస్సా, హర్యాన, ఢిల్లీ, మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వాలు క్రమబద్ధీకరించాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీని నెరవేర్చాలని ఆయన డిమాండు చేశారు.

Last Updated:2024-01-09

కరీంనగర్
డైలీ కార్మికులతో టిపిటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
కరీంనగర్: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ పట్టణం బీ ఎస్ ఎన్ ఎల్ కార్యాలయం ముందు 2024 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ కార్మికులతో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల రాములు, టీ పి టి ఫ్ జిల్లా అధ్యక్షుడు పోరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఉన్న ప్రజలందరికీ అంతరాలు లేని ,నాణ్యమైన , శాస్త్రీయమైన విద్య అందాలంటే ప్రభుత్వం వెంటనే కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కోర్టు కేసుల వల్ల ఆగిపోయిన టీచర్ల బదిలీల ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉపాధ్యాయ, ఉద్యోగులకు జీవిత భద్రతకు పెనుముప్పుగా మారిన సీపీఎస్ వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు . ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న మూడు డిఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే స్కావెంజర్లను నియమించాలని కోరారు. పాఠశాలలో కొనసాగుతున్న తొలిమెట్టు ఉన్నతి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి పాఠశాలల్లో ఉపాధ్యాయులకు తరగతి గదిలో బోధించే స్వేచ్ఛను కల్పించాలని కోరారు.

Last Updated:2024-01-09

కలెక్టరేట్
కబ్జాదారుల నుంచి ఫార్మా కాలేజ్ కాపాడాలి: అమీర్
కరీంనగర్: ఎల్ ఎం డీ దగ్గర్లోని శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీకి చెందిన భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని.. యుత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కరీంనగర్ జిల్లా మహమ్మద్ అమీర్ డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రజవాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. భూమిని అన్యాక్రాంతం కాకుండా చూడాలని.. రెవెన్యూ , సర్వే ల్యాండ్ అధికారులతో సర్వే చేయించి గోడ నిర్మించాలన్నారు. కబ్జా రాయళ్ల మీద ఉక్కు పాదం మోపి పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. గతంలో 3 నెలల కిందటే ఫిల్టర్ బెడ్ కబ్జా చేయడానికి ప్రయత్నించినా .. ఎంక్వైరీ అని చెప్పినా.. నేటి వరకు ఎలాంటి విచారణ చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రహమాన్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు, మహమ్మద్ ఇమ్రాన్ మాజీ కాంగ్రెస్స్ అసెంబ్లీ అధ్యక్షులు , సిరిపురం నాగరాజు, హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Last Updated:2024-01-08

గీతాభవన్
లోక్ సభ ఎన్నికల కోసమే కాంగ్రెస్ స్కీమ్ ల హడావిడి
కరీంనగర్: గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పథకాల పేరిట ప్రజలను మభ్యపెట్టి అమలులోవిఫలమైందని.. కాంగ్రెస్ ప్రకటించినట్లుగానే ఆరు గ్యారెంటీ పథకాలను 100 రోజుల్లో అమలు చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ అన్నారు. శనివారం నగరంలోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి పై దృష్టి సారించాలన్నారు. ఆరు స్కీమ్ ల అమలు గందరగోళంగా ఉందని .. నియమ నిబంధనలు విధివిధానాల్లో అనేక అంశాలపై అనుమానాలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని , అలాంటప్పుడు రేషన్ కార్డు ఆరు గ్యారంటీ పథకాలకు ఎలా ప్రామాణికం చేస్తారన్నారు. నామ్ కే వాస్తే దరఖాస్తులు స్వీకరించడం చూస్తుంటే ఇది కచ్చితంగా ఎంపీ ఎలక్షన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామాగా కనిపిస్తోందని విమర్శించారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ బిల్లుల కోసం గృహ జ్యోతి పథకం ఏ విధంగా అమలు చేస్తారు.. అద్దెకు ఉంటున్న వారి కుటుంబాలకు ఎలా వర్తింప చేస్తారో స్పష్టం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ హడావిడి చేస్తుందని .. దీంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారన్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, వాళ్ల విజ్ఞప్తులు స్వీకరించి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విదేశీ పర్యటనకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో బాధ్యత లేదా..? నియోజకవర్గ ప్రజలు ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ , జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్ , కార్పొరేటర్ దురిశెట్టి అనుప్ , కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డ్ సభ్యుడు , జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, గాజే రమేష్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్ , ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఏన్నం ప్రకాష్ , బండ రమణారెడ్డి నాగసముద్రం ప్రవీణ్ , పాదం శివరాజ్ , పొన్నాల రాము, తోట అనిల్, వాసు తదితరులు పాల్గొన్నారు.

Last Updated:2023-12-30

గంగాధర
రైతుబంధు పడితేనే పొలం నాట్లు ఎవుసం..
కరీంనగర్: వడ్ల పైసలతో పొలం దున్నిన, విత్తనాలు తెచ్చి నారుపోసిన.... కానీ నారు ఎదిగింది.. నాటు వేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు.. నారు ముదురుతోంది... అంటూ రైతుే ధీనంగా తన బాధను చెప్పుకోన్నాడు. చొప్పదండి నియోజకవర్గములోని కొడిమ్యాల మండలానికి ఓ శుభకార్యానికి వెళ్తున్న కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ గంగాధర మండల సమీపంలో ఓ పెట్రోల్ బంక్ దగ్గర తన వాహనాన్ని నిలుపగా మంగపేట గ్రామానికి చెందిన రైతు నర్సయ్య మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ని చూసి వాహనం దగ్గరకు వచ్చి .. వ్యవసాయ పొలం చూడండి సారూ మొరపెట్టుకున్నారు. రైతుబంధు పైసలు వస్తాయని ఆశకొద్ది చూస్తున్న...రెండు దినాలకోసారి బ్యాంకు కు వెళ్లి ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో చూసి వస్తున్నానని....ఇంకా రైతుబంధు పైసలు పడకపోవడంతో నాటు వేసేందుకు వెనుకడుగు వేస్తున్న అంటూ బాధపడ్డాడు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు రెండు పంటలకు పెట్టుబడి కోసం పైసలకు డోకా లేకుండె...నాటు వేసే సమయానికి రైతుబంధు పైసలు పడేటియి... గీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా బ్రతుకులు ఆగం అయ్యే పరిస్థితి వచ్చిందని మొర పెట్టుకున్నాడు. మాజీ ఎంపీ గారి వెంట మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పీఏసీఎస్ చైర్మన్ రాజనర్సింహ రావు, నాయకుల సంపత్ ఉన్నారు.

Last Updated:2023-12-28

కలెక్టరేట్
స్పెషల్ యాప్ చేయాలి: అమీర్
కరీంనగర్: కరీంనగర్ నగరంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యటన లో జిల్లా కాంగ్రెస్స్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అమీర్ రేషన్ కార్డు సమస్యల మీద వినతి పత్రం సమర్పించారు. చాలా సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న రేషన్ కార్డు సమస్యల మీద మెంబర్స్ మైగ్రేషన్.. కొత్తగా పెళ్లయిన అమ్మాయి వారి పేర్లు పోర్ట్ ఎంపిక ద్వారా అబ్బాయి రేషన్ కార్డులు చేర్చుట గురించి ఒక వెబ్సైట్ లో ప్రతేక యాప్ తయారు చేయాలని పౌరసరఫల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వినతి పత్రం ఇవ్వడంతో సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో చేస్తానని హామీ ఇచ్చారు.

Last Updated:2023-12-28

గణేశ్ నగర్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి
కరీంనగర్: హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబులు రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన వీరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బద్దం ఎల్లారెడ్డి పాత్ర కీలకమైనదని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి సంక్షేమంలో ముందుకు నడిపిన మహోన్నతమైన వ్యక్తి బద్దం ఎల్లారెడ్డి అని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి కొనియాడారు. బద్దం ఎల్లారెడ్డి 45వ వర్ధంతి సందర్భంగా బుధవారం కరీంనగర్ లోని కోతి రాంపూర్ బైపాస్ రోడ్డులో గల బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి మర్రి వెంకటస్వామి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గాలి పెల్లి గ్రామంలో 1906 లో భూ స్వామ్య కుటుంబం లో పుట్టిన బద్దం ఎల్లారెడ్డి విద్యార్థి దశలోనే దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పిలుపునందుకొని కాకినాడ ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నాడని, భూమి కోసం భుక్తి కోసం నిజాం నవాబ్ రజాకార్ల కబంధహస్తాల నుండి పీడిత ప్రజలను విముక్తి చేయడం కోసం ఆంధ్ర మహాసభ లో కీలక బాధ్యతలు నిర్వహించి భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాణంలో భాగస్వాములై ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి పిలుపునిచ్చి హైదరాబాద్ సంస్థానంలోని నిజాం రజాకర్ ఆగడాలను అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని ఆ పోరాటానికి పిలుపునిచ్చిన వారిలో బద్దం ఎల్లారెడ్డి అగ్రగన్యుడని అన్నారు.
హైదరాబాద్ రాష్ట్రానికి సిపిఐ తొలి కార్యదర్శిగా పనిచేశారని 1952 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ మొట్టమొదటి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారని బుగ్గారం ఇందుర్తి శాసనసభ్యులుగా కూడా పనిచేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి సంక్షేమంలో ఆయన సేవలు చిరస్మరణీయమైనవని అలాంటి గొప్ప నాయకుడని,ఎల్లారెడ్డి మరణించి 45 సంవత్సరాలు గడుపుతున్న సందర్భంగా గడిచినప్పటికీ ఆ మహనీయున్ని స్మరించుకోవడం కోసం ఆయన లక్ష్యాలను ఆశయాలను కొనసాగించడానికి కమ్యూనిస్టు శ్రేణులు సిద్ధం కావాలని,ఆయన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు పాలకులు కృషి చేయాలని మర్రి వెంకటస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్,కౌన్సిల్ సభ్యులు పిట్టల సమ్మయ్య,పైడిపెల్లి రాజు,కటికరెడ్డి బుచ్చన్న యాదవ్,,నలువాల సదానందం,బోనగిరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు

Last Updated:2023-12-27

చింతకుంట
గ్రామాల్లో జరిగే అభివ్రుద్ధి నిధులన్నీ కేంద్రానివే : ఎంపీ బండి సంజయ్
కరీంనగర్: గ్రామాల్లో ప్రతి ఇంట్లో పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు పేద ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీదే అని ఎంపీ బండి సంజయ్ అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా చింతకుంటలో నిర్వహించిన కార్యక్రమానికి బండి సంజయ్ విచ్చేశారు. కేంద్రమే టాయిలెట్ నిర్మిస్తోందని.. ఉజ్వల కింద గ్యాస్ కనెక్షన్ ఇస్తోందని.. ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తోందన్నారు. ఉపాధికి ఢోకా లేకుండా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తోందన్నారు. గ్రామాల్లో రోడ్లు, రైతు వేదికలు, పల్లె ప్రక్రుతి వనాలు సహా అభివ్రుద్ధి పనులకు కేంద్రమే నిధులిస్తోందన్నారు. రోడ్లు, లైట్లకు కేంద్రమే పైసలిస్తోంది గుర్తు చేశారు.

Last Updated:2023-12-27

జ్యోతినగర్
మహాశక్తి ఆలయంలో మహాపడిపూజ
కరీంనగర్: మహా శక్తి దేవాలయం లో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. మహాశక్తి ఆలయంలో మహాపడి పూజ కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సంజయ్ తో పాటు వారి కుటుంబ సభ్యులు ఈ పూజలో పాల్గొన్నారు.

Last Updated:2023-12-26

గణేశ్ నగర్
ఘనంగా సీపీఐ 99వ ఆవిర్భావ వేడుకలు
కరీంనగర్:
  • సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి
నిరంతరం కార్మిక,కర్షక శ్రేయస్సు కోసం,సమ సమాజ స్థాపన కోసం,మానవ జీవితంలో అంతరాలు లేని దోపిడీ రహిత సమాజం కోసం సీపీఐ నిరంతరం పనిచేస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 99వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కరీంనగర్ లోని సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ పై ఏర్పాటు చేసిన సీపీఐ పతాకాన్ని మర్రి వెంకటస్వామి ఆవిష్కరించారు.
సీపీఐ అనేక నిర్బంధాలను ఎదుర్కొందని దేశంలో అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని,పని గంటలు తగ్గించాలని,పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అనేక కార్మిక,ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఎన్నో విజయాలను సాధించిదని, భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తికి కూడు, గుడ్డ, నీడ కావాలని నేటికీ పేదల పక్షాన అనేక పోరాటాలు నిర్వహిస్తుందని ఒక్క సీపీఐ అని అలాంటి సీపీఐ పార్టీ 98 వసంతాలు పూర్తి చేసుకొని 99వ సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా దేశాన్ని కాపాడుకునేందుకు,రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు,ప్రజాస్వామ్యంను అపహాస్యం చేస్తూ దేశంలో కులాల వారిగా,మతాలవారీగా విభజించి పరిపాలిస్తున్న బిజెపి,ఎన్ డి ఏ కు వ్యతిరేకంగా సీపీఐ శ్రేణులు మరింత ప్రజలకు చేరువై ప్రజోద్యమాలు నిర్వహించాలని వెంకటస్వామి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి,సహాయ కార్యదర్శి కిన్నెర మల్లవ్వ,పైడిపెల్లి రాజు,జిల్లా కౌన్సిల్ సభ్యులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్,నలువాల సదానందం,బూడిద సదాశివ, బోనగిరి మహేందర్,సీపీఐ నగర నాయకులు న్యాలపట్ల రాజు,కొట్టే అంజలి,చెంచల మురళి,తంగేళ్ల సంపత్,సాయవేని రాయమల్లు,నునావత్ శ్రీనివాస్,కొమురయ్య,నల్లగొండ శ్రీనివాస్,రమేష్,బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు

Last Updated:2023-12-26

ఉద్యోగ నోటిఫికేషన్‌లు

Remember, torn clothes should not be left at home. Dispose of them out. Buying new clothes like towels.
Read

wearing clothes, bedsheets are like inviting good luck to the home.

Arrange doormats before every door and please change the doormats once in 6/8 months or maximum within 1 year. For More Daily

చరిత్రలో ఈరోజు [
Warning: Undefined variable $history_date in /home/u558784287/domains/golcondanews.com/public_html/telangana/district.php on line 632
Oct-19 ]


Warning: Undefined variable $history in /home/u558784287/domains/golcondanews.com/public_html/telangana/district.php on line 635

WhatsApp